PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మైక్రోసాఫ్ట్ షేర్లు అమ్మేసిన కంపెనీ సీఈవో !

1 min read

పల్లెవెలుగు వెబ్​: మైక్రో సాఫ్ట్ సీఈవో స‌త్య నాదెళ్ల .. మైక్రోసాఫ్ట్ షేర్లను అమ్మేశారు. మైక్రో సాఫ్ట్ లో స్టాక్ ఆప్షన్‌ కింద తనకు సంక్రమించిన షేర్లలో 8.39 లక్షల షేర్లను విక్రయించారు. గ‌త నెల 22-24 తేదిల‌లో ఈ షేర్లు విక్రయించిన‌ట్టు తెలుస్తోంది.  ఒక్కో షేరు సగటున 342 డాలర్ల చొప్పున విక్రయించారు. ఈ అమ్మకం ద్వారా సత్య నాదెళ్ల 2,138 కోట్లు సంపాదించారు. ఈ అమ్మకం తర్వాత కూడా సత్య నాదెళ్లకు మైక్రోసాఫ్ట్‌ కంపెనీలో 8.31 లక్షల షేర్లు ఉన్నాయి. మంచి ధర ఉండడంతో ఆయన తన వాటా షేర్లలో కొన్ని షేర్లను విక్రయించినట్టు సమాచారం.

About Author