PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఉన్నత పాఠశాల రికార్డ్ అసిస్టెంట్ కి ప్రశంసా పత్రం

1 min read

పల్లెవెలుగు వెబ్ చెన్నూరు : మండలం రామనపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో రికార్డ్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న ఎం లీలావతి కి రిపబ్లిక్ డే సందర్భంగా ప్రశంసా పత్రం అందుకున్నారు.75వ భారత గణతంత్ర దినోత్సవం సందర్భంగా శుక్రవారం కడప జిల్లా పరిషత్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్మన్ అకేపాటి అమర్నాథ్ రెడ్డి. సీఈవో ఏం సుధాకర్ రెడ్డి చేతులు మీదుగా ప్రశంస పత్రం అందుకున్నారు . శనివారం రామనపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఎం లీలావతికి అభినందన సభ జరిగింది. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయురాలు. ఉమామహేశ్వరి ఉపాధ్యాయులు. సిబ్బంది. విద్యార్థులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా హెచ్ఎం ఉమామహేశ్వరి మాట్లాడుతూ ఏం లీలావతి రికార్డ్ అసిస్టెంట్ గా తమ విధులు సక్రమంగా నిర్వర్తించినందుకు ప్రశంసా పత్రం అందుకోవడం చాలా సంతోషంగా విషయం అన్నారు.

About Author