PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

నూతన వృద్ధాశ్రమాన్ని ప్రారంభించిన చైర్మన్

1 min read

పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: నందికొట్కూరు పట్టణంలోని నంద్యాల రోడ్డు మారుతి నగర్ నందు విద్య పోగు చిన్న ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన వృద్ధాశ్రమాన్ని బుధవారం మున్సిపల్ చైర్మన్ దాసి సుధాకర్ రెడ్డి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ వృద్ధాశ్రమం గోరంట్ల చిన్న రంగమ్మ రూరల్ డెవలప్మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశామని నేటి నుంచి ప్రతిరోజు మూడు పూటలా వృద్ధులకు ఆహారం ఏర్పాటు చేయడం జరుగుతుందని నిర్వాహకులు చిన్న తెలియజేశారు. అనంతరం వృద్ధులకు చైర్మన్ సుధాకర్ రెడ్డి, కౌన్సిలర్ లాలూ ప్రసాద్ ఆహారం వడ్డించారు. వృద్దుల కోసం స్వచ్ఛంద సంస్థలు ముందుకు వచ్చి ఆశ్రమాలు ఏర్పాటు చేయడం అభినందనీయమని సుధాకర్ రెడ్డి అన్నారు . ఈ కార్యక్రమంలో మధుసూదన్ రెడ్డి, ఏసన్న, ఏసేపు, రాజనాల, స్వాములు వృద్ధులు తదితరులు పాల్గొన్నారు.

About Author