PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

చెన్నూరు భవానీ నగర్ లో చలివేంద్రం ప్రారంభం 

1 min read

పల్లెవెలుగు వెబ్ చెన్నూరు: గ్రామీణ మహిళా శక్తి ఫౌండేషన్’ ఆధ్వర్యంలో మండల కేంద్రమైన చెన్నూరు, భవానీ నగర్ లో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ఆదివారం కడప ఫైర్ స్టేషన్ కానిస్టేబుల్ నూర్ బాషా ప్రారంభించారు. ఈ సందర్బంగా నూర్ భాషా మాట్లాడుతూ, వేసవి తాపం ఇప్పటికే మొదలయినందున ఇలాంటి చలివేంద్రాల ఏర్పాటుకు దాతలు ముందుకు వచ్చి స్థానికంగా సమాజసేవ చేయాలన్నారు. మంచినీటి సౌకర్యంతో పాటు ప్రతివారం మజ్జిగ అందివ్వడం చాలా మంచిది ప్రస్తుతం ముదురుతున్న ఎండలు దృష్టిలో పెట్టుకొని స్వచ్ఛంద సేవా సంస్థలు చలివేంద్రాలు ఏర్పాటు చేసేందుకు ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ వ్యవస్థాపకులు బల్లెం శ్రీవెంకట్, చైర్మన్ యాగల శ్రీనివాసులు, చిన్నమాచుపల్లికి చెందిన బీజేపీ సీనియర్ నాయకులు చిన్నపురెడ్డి మరియు సీనియర్ పాత్రికేయులు గోపాలకృష్ణ. స్థానికులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

About Author