PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

జే సి ఎస్ మండల రూరల్ అదనపు ఇన్చార్జిగా చల్లా అన్వేష్ రెడ్డి

1 min read

పల్లెవెలుగు వెబ్ చెన్నూరు : జే సి ఎస్ మండల రూరల్ అదనపు ఇంచార్జ్ గా మండలంలోని ఓబులంపల్లె గ్రామానికి చెందిన చల్ల అన్వేష్ రెడ్డిని నియమితులయ్యారు, ఈ సందర్భంగా చల్లా అన్వేష్ రెడ్డి శనివారం చెన్నూరు లో విలేకరులతో మాట్లాడుతూ, జే సి ఎస్ మండల రూరల్ అదనపు ఇన్చార్జిగా తనను నియమించడానికి సహకరించిన కమలాపురం శాసనసభ్యులు పోచం రెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి,కి అలాగే యువ నాయకులు చింతకొమ్మ దిన్నే జడ్పిటిసి నరేన్ రామాంజనేయులు రెడ్డి, జె సి ఎస్ రాష్ట్ర కోఆర్డినేటర్ చల్ల మధుసూదన్ రెడ్డి కి ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు, నన్ను నమ్మి నాకు ఈ పదవి ఇచ్చినందుకు మండల వ్యాప్తంగా అన్ని సచివాలయ పరిధిలో ఇంటింటికి తిరిగి ప్రజలకు ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలను తెలియజేయడంతో పాటు, వైఎస్ఆర్సిపి పార్టీ బలోపేతానికి తమ వంతు బాధ్యతగా పనిచేస్తామని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జె సి ఎస్ మండల కోఆర్డినేటర్ ఎర్ర సాని నిరంజన్ రెడ్డి పాల్గొన్నారు.

About Author