NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

చంద్ర‌బాబు, లోకేష్ ను జైలుకు పంపాలి !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ఏపీలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా మాట్లాడుతున్న టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు, ఆయన కుమారుడు లోకేశ్‌లను జైలుకు పంపాలని ఏపీ పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి గుడివాడ అమర్‌నాథ్ అన్నారు. నిన్న విశాఖలో మీడియాతో చంద్రబాబుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విభజన హామీలను కేంద్రానికి తాకట్టుపెట్టిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందని విమర్శించారు. రాష్ట్రానికి అప్పులు ఇవ్వొద్దంటూ రిజర్వు బ్యాంకుకు టీడీపీ నేతలు లేఖలు రాశారని అన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి మూడు రాజధానులు ఏర్పాటు చేస్తామని చెప్పారు.

                                        

About Author