NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

బొజ్జ‌ల పాడె మోసిన చంద్ర‌బాబు

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొజ్జల గోపాల కృష్ణారెడ్డి అంత్యక్రియలకు ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు హజరయ్యారు. బొజ్జల అంతియ యాత్ర‌లో పాడెను మోశారు. బొజ్జలకు తుది వీడ్కోలు పలికేందుకు టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. బొజ్జల స్వస్థలం శ్రీకాళహస్తి మండలం, ఊరందూరులో బొజ్జల అంత్యక్రియలు నిర్వహించారు. బొజ్జల కుటుంబ సభ్యులు శనివారం మధ్యాహ్నం హైదరాబాద్‌ నుంచి విమానంలో తిరుపతి విమానాశ్రయానికి తీసుకొచ్చారు. అక్కడ నుంచి వాహనంలో రోడ్డు మార్గాన శ్రీకాళహస్తిలోని టీడీపీ కార్యాలయానికి తరలించారు. గంట సేపు ప్రజల సందర్శనార్థం ఉంచారు. అనంతరం పట్టణ ప్రధాన వీధుల మీదుగా ఊరేగింపుగా మధ్యాహ్నం 2.20 గంటలకు ఊరందూరుకు తరలించారు. పార్థివదేహం చూడగానే కుటుంబసభ్యులు, బంధువులు, గ్రామస్తులు భోరున విలపించడంతో గ్రామంలో ఉద్విగ్న వాతావరణం నెలకొంది.

                                                                

About Author