PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

చంద్రబాబు చెప్పింది చెయ్యడు..విజన్ జగన్

1 min read

-ఎన్నికల్లో ప్రలోభాలకు గురి చేస్తే నమ్మవద్దు

పల్లెవెలుగు వెబ్ మిడుతూరు: చంద్రబాబు ప్రజలకు ఇచ్చిన హామీలను చెప్పినది కూడా చేయడని..ముఖ్యమంత్రి జగన్  చెప్పని హామీలను కూడా ప్రజల మధ్యకు తీసుకువస్తూ ఉన్నారని ధైర్యం విజన్ ఉన్న నాయకుడు జగన్ అని వైసీపీ మండల కన్వీనర్ తువ్వా లోకేశ్వర రెడ్డి అన్నారు.శుక్రవారం సాయంత్రం నంద్యాల జిల్లా మిడుతూరు మండల పరిధిలోని కడుమూరు గ్రామంలో గ్రామ వైసీపీ సీనియర్ నాయకులు శంకర్ రెడ్డి ఆధ్వర్యంలో సర్పంచ్ జీవరత్నం అధ్యక్షతన జరిగినది.ఈ సందర్భంగా నందికొట్కూరు వైసీపీ నాయకులు జబ్బార్ మరియు సలాం మాట్లాడుతూ చిన్న కులాలకు కూడా మంత్రి పదవులను జగన్ ఇచ్చారని గత ప్రభుత్వ హయాంలో పథకాలు అందాలంటే నాయకుల దగ్గరికి వెళ్లే వారని రాబోయే రోజుల్లో మనం జగనన్నకు వెన్నుదన్నుగా ఉండాల్సిన అవసరం ఉందని వారు అన్నారు.సహకార సొసైటీ చైర్మన్ నాగ తులసి రెడ్డి మరియు మండల నాయకులు మల్లు శివ నాగిరెడ్డి మాట్లాడుతూ చంద్రబాబుకు రైతుల పట్ల కనీసం ప్రేమ లేదని ఆయన ఏ మొహం పెట్టుకొని ప్రజల ముందుకు వస్తున్నారో అర్థం కావడం లేదని మిడుతూరు మండలానికి ఎత్తిపోతల పథకం తీసుకువచ్చి రైతులకు నీరు అందిస్తామని వారు అన్నారు. చంద్రబాబుకు ముఖ్యమంత్రి జగన్ కు చాలా తేడా ఉందని  ఉప సర్పంచ్ నారాయణరెడ్డి అన్నారు.వచ్చే ఎన్నికల్లో ప్రలోభాలకు గురి చేస్తారని వాటిని ఎవ్వరూ కూడా నమ్మవద్దని అన్నారు.తర్వాత పార్టీ జెండాను నాయకుల ఆవిష్కరించారు.ఈ కార్యక్రమంలో గ్రామ విశ్వం రెడ్డి,ఈఓఆర్డి ఫక్రుద్దీన్,వైస్ ఎంపీపీలు నబి రసూల్, నాగమణి,రోళ్ళపాడు సర్పంచ్ వెంకటరామిరెడ్డి,హౌసింగ్ ఏఈ రమేష్ వివిధ గ్రామాల నాయకులు రాముడు,చిన్న రామచంద్రారెడ్డి,రామనాగేశ్వర రెడ్డి,సత్యం రెడ్డి,దాసి కృష్ణారెడ్డి,గోపాల్ రెడ్డి,కడుమూరు అన్వర్ భాష,రహమాన్,పంచాయతీ కార్యదర్శి శివకళ్యాణ్ సింగ్ మరియు మహిళలు పాల్గొన్నారు.

About Author