NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

చంద్ర‌బాబుకు తృటిలో త‌ప్పిన ప్ర‌మాదం

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రమాదం తృటిలో తప్పింది. కోనసీమ జిల్లా సోమపల్లి వద్ద చంద్రబాబు ప్రయాణిస్తున్న పంటుకు ప్రమాదం జరిగింది. అధిక బరువు కారణంగా పంటు ముందు భాగం రెక్క తెగిపోయింది. దాంతో మాజీ మంత్రులు దేవినేని ఉమా, పీతల సుజాత, పితాని సత్యనారాయణ, ఇతర టీడీపీ నేతలు ఒక్కసారిగా నీటిలో పడిపోయారు. కాగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో వరద ప్రాంతాల పర్యటన ముగించుకున్న చంద్రబాబు గోదావరిలో పంటుపై రాజోలు మండలం సోంపల్లికి చేరుకున్నారు. అయితే పంటు దిగి గట్టుకు చేరుకునేందుకు పడవలోకి చంద్రబాబు ఎక్కారు. ఆ తర్వాత చంద్రబాబు మరో పడవ ఎక్కుతుండగా పంటుపై ఏర్పాటు చేసిన బల్లవిరిగింది. దాంతో కొంతమంది టీడీపీ నేతలు, సెక్యూరిటీ సిబ్బంది, మీడియా ప్రతినిధులు గోదావరి నదిలో పడిపోయారు. అయితే అందరూ సురక్షితంగా ఉన్నారు.

                               

About Author