PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

సంపద సృష్టించే సత్తా చంద్రబాబుకు ఉంది… టి.జి భరత్

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు: రాష్ట్రంలో సంపద సృష్టించే సత్తా చంద్రబాబు నాయుడుకు ఉందని కర్నూలు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జి టి.జి భరత్ అన్నారు. కర్నూలు నగరంలోని 23 వ వార్డు శ్రీరామ్ నగర్లో ఆయన పర్యటించి ఇంటింటికి తిరిగి ప్రజలను కలిశారు. తెలుగుదేశం పార్టీ భవిష్యత్తుకు గ్యారెంటీ కరపత్రాలు ప్రజలకు అందించి వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని గెలిపించాలని ఆయన కోరారు. రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలకు మేలు జరగాలంటే టిడిపి గెలవాలన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం ఉంటాయన్నారు. టిడిపి మొదటి విడత మేనిఫెస్టోతో ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందన్నారు. కష్టాల్లో ఉన్న రాష్ట్రానికి చంద్రబాబు నాయకత్వం అవసరమని భరత్ తెలిపారు. రాష్ట్రంలో సంపద సృష్టించే సత్తా ఉన్న నాయకుడు చంద్రబాబు అన్నారు. ఇక తనను ఎమ్మెల్యేగా గెలిపిస్తే కర్నూల్లో అన్ని విధాల డెవలప్మెంట్ చేస్తానన్నారు. పరిశ్రమలు ఉంటే యువతకు ఉద్యోగాలు రావడంతో పాటు అన్ని వర్గాలు అభివృద్ధి చెందుతాయని ప్రజలకు వివరించారు. ఒక్క అవకాశం ఇచ్చి ఎమ్మెల్యేగా తన పనితీరు చూడాలని టిజి భరత్ ప్రజలను కోరారు. ఈ సందర్భంగా ప్రజలు టిజి భరత్ తో మాట్లాడుతూ సమస్యలు చెప్పుకున్నారు. అర్హత ఉన్నా సంక్షేమ పథకాలు అందడం లేదని చెప్పారు. డ్రైనేజి వ్యవస్థ అద్వాన్నంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి నేతలు గున్నామార్క్, అజయ్, ఉదయ్, జుబేర్, విజయ్, మధు, ముత్తు, చిన్న, అనిల్, ప్రేమ్, తదితరులు పాల్గొన్నారు.

About Author