PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

రాజకీయ దురంధరుడు.. ఏపీ ఆపద్బాంధవుడు చంద్రబాబు

1 min read

టిడిపి రాష్ట్ర కార్యదర్శి కాశీభట్ల సత్య సాయినాథ్ శర్మ

పల్లెవెలుగు, చెన్నూరు:  తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు,  ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాజకీయ దురంధరుడు  ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల ఆపద్బాంధవుడు అని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి కాశీభట్ల సత్యసాయినాథ్ శర్మ కొనియాడారు.  చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యేగా తన రాజకీయ ప్రస్థానంలో  44 సంవత్సరాలు పూర్తి చేసుకొని 45  వసంతం లోకి అడుగు పెట్టిన సందర్భంగా  కమలాపురంలో శుక్రవారం అనాధలకు పండ్లు పంచిపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎమ్మేల్యే గా ప్రస్థానాన్ని ప్రారంభించి, పిన్న వయసులో మంత్రిగా, అనంతరం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు, విభజిత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గా 14 సంవత్సరాలు పనిచేసి రాష్ట్రాన్ని స్వర్ణాంధ్ర ప్రదేశ్ దిశగా పయనింప చేసిన దార్శినికుడుగా,   రాజకీయాలలోమొక్కవోని  అలుపెరుగని వీరుడిగా తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లి అమెరికా లాంటి అగ్రరాజ్య దేశ నేతలను సైతం తెలుగు ముంగిటికి రప్పించిన మహోన్నత వ్యక్తిత్వం గల నిస్వార్థ ప్రజా నాయకుడు చంద్రబాబు అని సాయినాథ్ శర్మ కొనియాడారు. ఏడు పదుల వయసులో కూడా అలుపెరగకుండా రాజకీయ పోరాటం చేస్తూ తెలుగుదేశం పార్టీ పటిష్టతను చెక్కుచెదరకుండా కాపాడుతూ నాయకులకు, కార్యకర్తలకు విశ్వాసాన్ని, నమ్మకాన్ని ఇచ్చి ముందుకు నడిపిస్తున్న ప్రజా పరిపాలన దక్షత ఒక్క చంద్రబాబుకే దక్కుతుందన్నారు. ప్రజాస్వామ్యం లో  ప్రజలే దేవుళ్ళుగా భావించే తెలుగు దేశం పార్టీకి జాతీయ అధ్యక్షుడుగా నిరంతరం ప్రజా సేవకే అంకితమైన  మహనీయుడు చంద్రబాబునాయు డన్నారు.  రాష్ట్రంలో మరలా ముఖ్యమంత్రి స్థానాన్ని చంద్రబాబునాయుడు  అధిరోహించినప్పుడే ఆంధ్రప్రదేశ్ ప్రగతిపథంలో నడిచి రాష్ట్ర దశ దిశ మారుతుందన్నారు . ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడుని చేయడానికి ప్రతి తెలుగుదేశం నాయకుడు, ప్రతి కార్యకర్త బాధ్యతాయుతమైన కృషి చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో  రైతు సంఘ నాయకుడు కల్లూరు జనార్దన్ రెడ్డి 12వ వార్డు కౌన్సిలర్ బాబు తెలుగుదేశం నాయకులు నాగేంద్ర రెడ్డి రామ సుబ్బారెడ్డి రవి సంఘ నాయకుడు నంద్యాల మహేష్ తెలుగు యువత నాయకుడు నవీన్ ఇతరులు పాల్గొన్నారు.

About Author