PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

చంద్ర‌బాబు చ‌రిత్ర‌హీనుడు !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : టీడీపీ అధినేత చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు పోలవరం, ప్రత్యేక హోదా కోసం ఎందుకు రాజీనామా చేయలేదని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ప్రశ్నించారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు చరిత్ర హీనుడు అని… ప్రజలు చెత్త బుట్టలో పడేశారని వ్యాఖ్యలు చేశారు. సీఎం ఆచరణాత్మకమైన ప్రణాళికతో పోలవరం ఆర్ అండ్ ఆర్‌పై ప్రకటన చేశారని తెలిపారు. కేంద్రం నుండి నిధులు రావటం లేటైనా 41.5 అడుగుల వరకూ ఆర్ అండ్ ఆర్ తాను ఇస్తాను అని సీఎం చెప్పారన్నారు. 45.5 అడుగుల వరకూ పూర్తిగా నీటిని నింపాలంటే రెండేళ్ళు పడుతుందని… ఈలోపు కేంద్రం నుండి నిధులు తీసుకొస్తామ‌న్నారని తెలిపారు.

                                                           

About Author