NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

తిరుప‌తి చేరుకున్న చంద్రబాబు

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్: ఉపఎన్నిక‌ల ప్రచారంలో భాగంగా చంద్రబాబు తిరుప‌తి చేరుకున్నారు. రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుని అక్కడి నుంచి తిరుమ‌ల వెళ్లారు. తిరుమ‌ల శ్రీకృష్ణ అతిథి గృహం వద్ద ఆయ‌న‌కు తితిదే అధికారులు స్వాగతం ప‌లికారు. తిరుమ‌ల వెంక‌టేశ్వర‌స్వామిని ద‌ర్శించుకున్న అనంత‌రం శ్రీకాళ‌హ‌స్తి నుంచి ఆయ‌న ప్రచారం ప్రారంభించ‌నున్నారు. తిరుప‌తి ఉపఎన్నిక‌ను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది ఏపీ ప్రభుత్వం. ఈ నేప‌థ్యంలో ఈనెల 14న ముఖ్యమంత్రి జ‌గ‌న్ కూడ తిరుప‌తి ఉపఎన్నిక‌ల ప్రచారంలో పాల్గొంటార‌ని స‌మాచారం. 14న జ‌రిగే రోడ్ షోలో పాల్గొని… అనంత‌రం బ‌హిరంగ స‌భ‌లో ప్రసంగిస్తార‌ని ఆ పార్టీ వ‌ర్గాలు పేర్కొన్నాయి.

About Author