PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

చంద్రబాబును రాష్ట్ర బహిష్కరణ చేయాలి…

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  చిత్తూరు జిల్లాలోని పుంగనూరులో జరిగిన ఘటనలు పునరావృతం కాకుండా చంద్రబాబును రాష్ట్ర బహిష్కరణ చేయాలని కర్నూల్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. కర్నూలు అంబేద్కర్ విగ్రహం వద్ద ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటే చంద్రబాబుపై చర్యలు తీసుకోవాలంటూ నిరసన వ్యక్తం చేశారు. పుంగనూరు అల్లర్లకు పాల్పడిన చంద్రబాబు వైఖరికి నిరసనగా చంద్రబాబు దిష్టిబొమ్మను దగ్ధం చేసి నిరసన వ్యక్తం చేశారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలంటే చంద్రబాబు పవన్ కళ్యాణ్ నారా లోకేష్ వ్యాఖ్యలపై కోర్టు సుమోటుగా కేసులు నమోదు చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు నగర మేయర్ రామయ్య , కర్నూలు ఎమ్మెల్యే హాఫిజ్ ఖాన్  మండిపడ్డారు. ప్రజలకు రక్షణ కల్పిస్తున్న పోలీసులపై చంద్రబాబు దాడులు చేయించడం దుర్మార్గమైన చర్య అంటూ విమర్శించారు.ఈ కార్యక్రమం లో వైస్సార్సీపీ కార్పొరేటర్లు నాయకులు తదితరులు పాల్గొన్నారు.

About Author