PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

వరద బాధితులను పరామర్శించనున్న చంద్రబాబు

1 min read


పల్లెవెలుగు వెబ్: అసెంబ్లీలో తన భార్యను కించపర్చారని ఆరోపిస్తూ చంద్రబాబు బోరున విలపించిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఘటన నుంచి తేరుకున్న చంద్రబాబు ప్రజా సమస్యలపై దృష్టిసారించనున్నారు. భారీ వర్షాలతో అతలాకుతలమైన చిత్తూరు, అనంతపురం, కడప, నెల్లూరు జిల్లాల్లో వరద బాధితులను పరామర్శించనున్నారు. రేపు కడప జిల్లాలో… ఎల్లుండి చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో పర్యటిస్తారని టీడీపీ వర్గాలు తెలిపాయి. ఇప్పటికే సీఎం జగన్ వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే చేసిన సంగతి తెలిసిందే. కాగా, భారీవర్షాల కారణంగా వందలాది మంది నిరాశ్రేయులు అయ్యారు. వేలాది ఎకరాల పంట నీటమునిగింది. వందలాది పశువులు వరద ధాటికి కొట్టుకుపోయాయి. చిత్తూరు, కడప, నెల్లూరు జిల్లాలో పలు గ్రామాలు ఇప్పటికీ ముంపులోనే ఉన్నాయి. నిత్యావసరాలు అందక బాధితులు అల్లాడుతున్నారు.

About Author