NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

వైసీపీ నేతలు అలా మాట్లాడడంతో భరించలేకపోయా: చంద్రబాబు

1 min read


పల్లెవెలుగు వెబ్: ప్రతిపక్ష నేత చంద్రబాబు చిత్తూరు జిల్లాలో పర్యటించారు. వరద బాధితులను పరామర్శించారు. మానవ తప్పిదాలతో వరదలు వచ్చాయని.. ప్రభుత్వం బాధ్యత వహించాలన్నారు. బాధితులకు సహాయం అందేవరకు పోరాడతామన్నారు. పాపానాయుడు పేట వద్ద చంద్రబాబు ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. గొలుసుకట్టు చెరువులకు వరద రాకముందే నీటిని విడుదల చేయాల్సి ఉంటుందని.. అలా చేయకపోతే వరద తీవ్రమయ్యే పరిస్థితి ఏర్పడుతుందన్నారు. చిన్న పట్టణం కుప్పంలో రౌడీయిజంతో గెలిచి వైసీపీ నేతలు విర్రవీగుతున్నారని మండిపడ్డారు. తన సతీమణి ఏనాడూ రాజకీయాల్లోకి రాలేదని.. కానీ అసెంబ్లీలో ఆమె వ్యక్తిత్వాన్ని కించపరిచేలా వైసీపీ నేతలు మాట్లాడటంతో భరించలేక పోయానని చంద్రబాబు అన్నారు. తప్పుడు పనులు చేసేవారిని వదిలిపెట్టనని హెచ్చరించారు. అధికారంలోకి వచ్చాక అక్రమ కేసులపై విచారణ చేసి బాధ్యులను శిక్షిస్తామని చంద్రబాబు స్పష్టం చేశారు.

About Author