PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

సుబ్ర‌హ్మ‌ణ్యం భార్య‌ను ప‌రామ‌ర్శించిన చంద్ర‌బాబు

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : హత్యకు గురైన వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు కారు డ్రైవర్ సుబ్రహ్మణ్యం భార్య అపర్ణను టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఫోన్‌లో పరామర్శించారు. అనంతబాబే తన భర్తను హత్య చేశాడని, దళిత సంఘాలు చేసిన పోరాటం వల్లే పోలీసులు చివరికి హత్య కేసుగా నమోదు చేశారని అపర్ణ చెప్పారు. తనను పోలీసులు తీవ్రంగా వేధించారని…ప్రభుత్వం తనను ప్రలోభ పెట్టే ప్రయత్నాలు చేసిందని ఆరోపించారు. ఇప్పటికీ పోలీసుల విచారణపై తనకు అనుమానాలున్నాయని, తన భర్త హత్య కేసును సీబీఐతో విచారణ జరిపించాలని అపర్ణ డిమాండ్ చేశారు.

 

About Author