PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

చంద్రబాబు అరెస్టు అన్యాయం… టిడిపి నేతలు

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్మెంట్ కేసులో కడిగిన ముత్యంలా జైలు నుండి బయటకు వస్తారని టిడిపి నేతలు అన్నారు. కర్నూలు నగరంలోని ధర్నా చౌక్ వద్ద చంద్రబాబు అరెస్టుకు నిరసనగా కర్నూల్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంఛార్జీ టిజి భరత్ ఆధ్వర్యంలో నేతలు నిరాహార దీక్ష చేపట్టారు. కర్నూల్ పార్లమెంట్ అధ్యక్షులు, ఎమ్మెల్సీ బి.టి నాయుడు, ఇతర నేతలు, కార్యకర్తలు దీక్షలో కూర్చున్నారు. ఎటువంటి ఆధారాలు లేకుండా చంద్రబాబును స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్టు చేశారని నేతలు మండిపడ్డారు. 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎలాంటి అవినీతి మచ్చ లేకుండా చంద్రబాబు ఉన్నారన్నారు. ఈ కేసులో విచారణ పూర్తయ్యాక నిర్దోషిగా ఆయన బయటపడతారన్నారు. ఈ దీక్షలో నగర అధ్యక్షుడు నాగరాజు యాదవ్, 8వ వార్డు కార్పొరేటర్ పరమేష్, క్లస్టర్ ఇంఛార్జీ శ్రీనివాస్ రెడ్డి, 9వ వార్డు ఇంఛార్జీ శేషగిరి శెట్టి, 12వ వార్డు ఇంఛార్జీ చిన్నమ్మ, 13వ వార్డు ఇంఛార్జీ సురేష్, తిరుపాల్ బాబు, ప్రొఫెషనల్ వింగ్ సభ్యులు సాయి నందన్, నవీన్ చౌదరి, భరత్ కుమార్, నిఖిల్, అశోక్ కుమార్, అశోక్ చౌదరి, తదితరులు పాల్గొన్నారు.

About Author