PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఎన్డీఏలో చేరిక పై చంద్ర‌బాబు కీల‌క వ్యాఖ్య‌లు !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ఎన్డీఏలో టీడీపీ చేరబోతుందన్న ప్రచారంపై టీడీపీ అధినేత చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. అలా ప్రచారం చేస్తున్నవారే.. దానికి సమాధానం చెప్పాలన్నారు. ఈ విషయంపై తానే ఇప్పుడేం స్పందించనని తెలిపారు. రాష్ట్ర ప్రయోజనాల కోసమే ఆనాడు ఎన్డీఏ నుంచి బయటకువచ్చామని చంద్రబాబు గుర్తుచేశారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో టీడీపీకి గట్టి ఓటు బ్యాంకు ఉందని, తెలంగాణలో దానికి 10-20 శాతం ఓట్లు ఉన్నాయని, అందుచేత వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీతో పొత్తు పెట్టుకునేందుకు బీజేపీ సానుకూలంగా ఉందని రిపబ్లిక్‌ టీవీ చానల్‌ వెల్లడించింది.

                                                      

About Author