PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

విలీన మండ‌లాల్లో చంద్ర‌బాబు ప‌ర్య‌ట‌న

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ఏపీ విలీన మండలాల్లో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పర్యటన కొనసాగుతోంది. గూండాల గ్రామంలో వరద బాధితుల్ని బాబు పరామర్శించారు. ఈ సందర్భంగా టీడీపీ అధినేత మాట్లాడుతూ… ప్రజలు ట్రాక్ రికార్డు చూసి నేతల్ని ఎన్నుకోవాలని అన్నారు. దొంగలకి అధికారం ఇస్తే ఏమౌతుందో ప్రజలు ప్రత్యక్షంగా చూస్తున్నారని తెలిపారు. డ్రైవింగ్ రానివాడికి రాష్ట్రాన్ని అప్పగించటంతో ప్రజా జీవితం తలకిందులైందని వ్యాఖ్యానించారు. ఐదు విలీన గ్రామాల సమస్య తాత్కాలికమే అని చెప్పుకొచ్చారు. తెలుగుదేశం అధికారంలోకి రాగానే శాశ్వత పరిష్కారం చూపుతుందని హామీ ఇచ్చారు. ప్రభుత్వం ప్రజల్ని మెప్పించాలి తప్ప ఇబ్బంది పెట్టకూడదన్నారు.

                                                             

About Author