PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

చంద్రన్న పథకాలే మన భవిష్యత్తుకు గ్యారెంటీ

1 min read

పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: చంద్రన్న పథకాలే మన భవిష్యత్ కు గ్యారెంటీ అని నంద్యాల పార్లమెంట్ ఇంచార్జి మాండ్ర శివానంద రెడ్డి పేర్కొన్నారు. టీడీపీ అధిష్టానం ఆదేశాల మేరకు నందికొట్కూరు పట్టణంలో  బాబు షూరిటీ భవిష్యత్తుకి గ్యారెంటీ కార్యక్రమంలో భాగంగా  టీడీపీ నంద్యాల పార్లమెంట్, ఇన్చార్జి మాండ్ర శివానందరెడ్డి  పట్టణంలోని మారుతి నగర్ 12 ,27 వ వార్డులో గురువారం  వార్డు ఇంచార్జ్ లు టీడీపీ రాష్ట్ర మైనార్టీ సెల్ అధికార ప్రతినిధి  షకీల్ అహమ్మద్,  శాంతరాజు , వార్డు సభ్యులు, పట్టణ నాయకుల ఆధ్వర్యంలో  నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాండ్ర శివానందా రెడ్డి హాజరయ్యారు. ప్రతి ఇంటికి తిరుగుతూ  ఆప్యాయంగా పలకరిస్తూ, చిరునవ్వుతో ప్రజలను కలుసుకొని చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన సూపర్ సిక్స్ పథకాలను తెలియజేశారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఆడబిడ్డ నిది, తల్లికి వందనం ఏడాదికి నాలుగు గ్యాస్ సిలిండర్లు  ఉచితం, అన్నదాత పథకం కింద ప్రతి రైతుకు ఏడాదికి రూ. 20 వేల  ఆర్థిక సాయం, యువగళం నిధి కింద నెలకు రూ.  3000  ఆర్థిక సాయం, బీసీలకు రక్షణ చట్టం, ఇంటింటికి కుళాయి కనెక్షన్లు, ఐదేళ్లలో పేదల ఆదాయం రెట్టింపు పేదలను సంపన్నులు చేయటమే తెలుగుదేశం పార్టీ ధ్యేయమని  పథకాలను ప్రతి ఇంటికి  వెళ్లి ప్రజలకు వివరించారు. టీడీపీ అధికారం లోకి తీసుకొని రావాలని, చంద్రబాబు నాయుడును  ముఖ్యమంత్రి గా చేసుకుంటేనే మన భవిష్యత్తు అని ప్రజలకు పేర్కొన్నారు.ఈ సందర్భంగా మాండ్ర శివానందరెడ్డి  మాట్లాడుతూ జగన్ మోహన్ రెడ్డి కక్షపూరితంగా చంద్రబాబు నాయుడు ను  స్కిల్ డెవలెప్మెంట్  కేసులో  అక్రమంగా అరెస్ట్ చేయించారన్నారు. సైకో జగన్ ని వచ్చే ఎన్నికల్లో టీడీపీ కి ఓటు వేసి   గద్దె దించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ  కార్యక్రమంలో ఎస్సీ సెల్ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ జయ సూర్య,కౌన్సిలర్ భాస్కర్ రెడ్డి, మైనార్టీ నాయకులు జమీల్, రసూల్ ఖాన్, ముత్తు జావలి, బి.జనార్ధన్, సౌదీ చాంద్ భాష, శాంతరాజు, సయ్యద్ అహ్మద్, రషీద్ ఖాన్, నిమ్మకాయల మోహన్, రాజు, బొల్లెద్దుల రాజన్న, కళాకర్ వేణు గోపాల్, మద్దిలేటి, తదితరు టిడిపి నాయకులు పాల్గొన్నారు.

About Author