PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఏపీలో క‌ర్ఫ్యూ స‌డ‌లింపుల్లో మార్పులు

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్ : ఆంధ్ర ప్రదేశ్ లో క‌ర్ఫ్యూ స‌డ‌లింపుల్లో మార్పులు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గోదావ‌రి జిల్లాల్లో ఉద‌యం 6 గంట‌ల నుంచి సాయంత్రం 7 గంట‌ల వ‌ర‌కు స‌డ‌లింపులు ఉంటాయ‌ని తెలిపింది. సాయంత్రం 6 గంట‌ల‌కే దుకాణాలు మూసివేయాల‌ని ప్రభుత్వం ఆదేశించింది. వైద్య ఆరోగ్య శాఖ అధికారుల‌తో నిర్వహించిన స‌మీక్షలో సీఎం ఈ నిర్ణయం తీసుకున్నారు. మిగ‌తా జిల్లాల్లో ఉద‌యం 6 నుంచి రాత్రి 10 గంట‌ల వ‌ర‌కు స‌డ‌లింపులు ఉన్నాయి. గోదావ‌రి జిల్లాలు మిన‌హా మిగిలిన జిల్లాల్లో రాత్రి 9 గంట‌ల‌కు దుకాణాలు మూసివేయాలి. ఉభ‌య‌గోదావ‌రి జిల్లాల్లో పాజిటివిటీ రేటు 5 శాతం లోపు వ‌చ్చే వ‌ర‌కు క‌ర్ఫ్యూ కొన‌సాగ‌నుంది.

About Author