PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

‘మానవత’ ఆధ్వర్యంలో అన్నదానం

1 min read

పల్లెవెలుగు వెబ్​, కర్నూలు: ‘మానవత’ స్వచ్ఛంద సేవా సంస్థ కర్నూలు యూనిట్‌ ఆధ్వర్యంలో నగరంలోని హోమ్‌ ఆఫ్‌ హోమ్‌ ఆశ్రమంలోని 50 మందికిపైగా అనాథలకు ఆదివారం అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రోగ్రాం కమిటీ చైర్మన్‌ గోనూరు యుగంధర్‌శెట్టి, మెంబర్‌షిప్‌ డెవలప్‌మెంట్‌ కమిటీ చైర్మన్‌ పోలెపల్లి శేషయ్య, మానవత మెంబర్‌ రవిరాజు, హుసేనయ్య ఉన్నారు. ఈ సందర్భంగా యుగంధర్‌శెట్టి మాట్లాడుతూ.. ‘మానవత’ ఆధ్వర్యంలో అన్నదానం నిర్వహణకు ముందుకు వచ్చిన రవిరాజును అభినందిస్తున్నట్టు తెలిపారు. ఇంకా మరిన్ని సేవా కార్యక్రమాలు చేసేందుకు రవిరాజు ముందుకు రావాలని ఆశాభావం వ్యక్తం చేశారు. 50 మందికి పైగా అనాథలకు బిర్యానీ ఏర్పాటు చేయడం అన్నది సంతోషించతగ్గ విషయమని చెప్పారు. అంతే కాకుండా ‘మానవత’ సేవా సంస్థ ద్వారా బ్లడ్‌ డొనేషన్స్‌, మొక్కల పెంపకం, విద్యార్థులకు అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఇంకా పీజర్‌ బాక్స్‌లు, వైకుంఠరథాలు ఉచితంగా అందిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆశ్రమ నిర్వాహకులు, ‘మానవత’ సేవా సంస్థ సభ్యులు పాల్గొన్నారు.

About Author