PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

కులాల మ‌ధ్య చిచ్చుకే ప‌వ‌న్ ప‌ర్య‌ట‌న : అజంద్ భాషా

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : తన స్వప్రయోజనాల కోసం వైఎస్సార్‌ జిల్లాలో కులాల మధ్య చిచ్చు రేపేందుకే పవన్‌కళ్యాణ్‌ పర్యటించారని ఉప ముఖ్యమంత్రి అంజద్‌ బాషా విమర్శించారు. తన క్యాంపు కార్యాలయంలో వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు, కడప మేయర్‌ కె. సురేష్‌బాబుతో కలిసి శనివారం అంజద్‌ బాషా మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లా ప్రజలు కులమతాలకు అతీతంగా వైఎస్‌ కుటుంబాన్ని గుండెల్లో పెట్టుకున్నారన్న విషయాన్ని పవన్‌ గుర్తుంచుకోవాలన్నారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వచ్చాక రైతుభరోసా కేంద్రాల ద్వారా నాణ్యమైన విత్తనాలు, ఎరువులు సరఫరా చేస్తున్నామని, రైతులు విత్తు వేసినప్పటి నుంచి గిట్టుబాటు ధర కల్పించే వరకూ ప్రభుత్వం వారికి అండగా ఉంటోందన్నారు.

                                        

About Author