PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ప్రజల గుండెల్లో నిలిచిన ముఖ్యమంత్రి జగన్

1 min read

– జగన్ పాలనలో ఇంటింటా సంక్షేమం..
– నందికొట్కూరు మున్సిపాలిటీ 10 వ సచివాలయం పరిధిలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం..
పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: ప్రజల గుండెల్లో సీఎం జగన్ నిలిచారని నందికొట్కూరు ఎమ్మెల్యే తొగురు ఆర్థర్ అన్నారు. సోమవారం నందికొట్కూరు మున్సిపాలిటీ 10 వ సచివాలయం పరిధిలోని షికారి పేట , శాంతి దివేటర్ ఏరియా, సంత మార్కెట్ వీధి లో కమిషనర్ పి. కిషోర్ ఆధ్వర్యంలో ఉదయం 9 గంటలకే గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్తమాన్ని ప్రారంభించారు . గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు.ఇంటింటా పర్యటిస్తూ, ప్రజలతో మమేకమవుతూ, ప్రజా సమస్యలుపై ఆరా తీశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆర్థర్ మాట్లాడుతూ జగనన్న పాలనలో అర్హతే ఆధారంగా ఇంటింటా సంక్షేమ లబ్ది అందుతోందన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉర్దూ అకాడమీ డైరెక్టర్ హాజీ అబ్దుల్ శుకూర్ , మున్సిపల్ వైస్ చైర్మన్ మొల్ల.రబ్బాని, తహశీల్దార్ రాజశేఖర్ బాబు , కౌన్సిలర్ మొల్ల జాకీర్ హుస్సేన్ , నందికొట్కూరు వ్యవసాయ సహకార పరపతి సంఘం చైర్మన్ సగినేల.ఉసేనయ్య , వైసీపీ నాయకులు తమలపల్లి విక్టర్, విశ్రాంత పోలీస్ అధికారి పెరుమాల్ల.జాన్ , ముజీబ్, వలి బాషా, వేంకట స్వామి, బిజినవేముల మహేష్, మల్యాల శంకరయ్య, దామగట్ల రత్నం,భాస్కర్, వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు పాల్గొన్నారు.

About Author