PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ముఖ్య‌మంత్రి రాజీనామా !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : త్రిపుర ముఖ్యమంత్రి బిప్లబ్ కుమార్ దేబ్ శనివారం తన పదవికి రాజీనామా చేశారు. ఆయన తన రాజీనామాను గవర్నర్‌ సత్యదేవ్ నారాయణ్ ఆర్యకు సమర్పించారు. ఆయన ఇటీవల కేంద్ర హోం మంత్రి అమిత్ షా, బీజేపీ అద్యక్షుడు జేపీ నడ్డాలను కలిశారు. రాజీనామా చేసిన తర్వాత బిప్లబ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ, ప్రతిదానికీ ఓ నిర్ణీత కాలం ఉంటుందని చెప్పారు. తాము ఆ నిర్ణీత కాలాన్నిబట్టి పని చేస్తామన్నారు. తనకు ఏ పదవిని అప్పగించినా తాను అందులో ఇమిడిపోతానని చెప్పారు. ముఖ్యమంత్రి పదవి అయినా, వేరొకటి అయినా తాను అందుకు తగినట్లుగా వ్యవహరిస్తానన్నారు.

                             

About Author