NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

పిల్లల్ని దేవుని ప్రేమలో పెంచాలి : ఫాదర్ మధు బాబు

1 min read

పల్లెవెలుగు వెబ్  మిడుతూరు: చిన్నపిల్లలను తల్లిదండ్రులు దేవుని ప్రేమలో పెంచుతూ దేవుని సేవలో వారు ఎదిగే విధంగా చూసే బాధ్యత తల్లిదండ్రులపై ఉందని ఉప్పలదడియ ఆర్సిఎం విచారణ గ్రూపులో ఫాదర్ మధుబాబు అన్నారు. నంద్యాల జిల్లా మిడుతూరు మండల పరిధిలోని కడుమూరు గ్రామంలో ఏ. హరిబాబు,ప్రమీల దంపతుల కుమారుడు(బాలస్వామి, రవణమ్మ మనవడు)విక్కీ రెండవ జన్మదిన సందర్భంగా గ్రామంలోని ఆర్.సి.యం చర్చి ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి అతిధులు హాజరయ్యారు.విచారణ గురువులు మధుబాబు దివ్యబలి పూజను సమర్పిస్తూ వాక్య పరిచర్య చేశారు. జన్మదిన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. తర్వాత కేక్ కట్ చేశారు.ఈ కార్యక్రమంలో అరుణ్ కుమార్, మధు,రాజు,దాసు,పౌలయ్య, ఫ్రాన్సిస్,పక్కిరయ్య,జాన్, అశోక్ మరియు బంధు మిత్రులు తదితరులు పాల్గొన్నారు.

About Author