PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

అరుణాచల్ ప్రదేశ్ యువకుడిని అప్పగించిన చైనా

1 min read

పల్లెవెలుగువెబ్ : అరుణాచల్ ప్రదేశ్ కు చెందిన మిరామ్ తరోన్ ఇటీవల అపహరణకు గురైనట్టు వార్తలు వచ్చాయి. దీంతో వెంటనే భారత రక్షణ శాఖ చైనా బలగాలతో హాట్ లైన్ ద్వార సంప్రదింపులు జరిపాయి. ఈ క్రమంలో ఆ యువకుడి ఆచూకి కనుగొన్నట్టు పీఎల్ఏ గత ఆదివారం తెలిపింది. తాజాగా గురువారం అతడిని భారత సైన్యానికి అప్పగించింది. ఈ విషయాన్ని ధృవీకరిస్తూ కేంద్ర మంత్రి కిరణ్​ రిజుజు ట్వీట్ చేశారు. ప్రస్తుతం మిరామ్ తరోన్ కు వైద్య పరీక్షలు నిర్వహించడంతో పాటు ఇతర ప్రోటోకాల్స్ పాటిస్తున్నట్టు తెలిపారు.

          

About Author