NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

చైనా ఎత్తుకెళ్లిన.. భారతీయుడు ఆచూకీ లభ్యం !

1 min read

పల్లెవెలుగువెబ్ : అరుణాచల్ ప్రదేశ్ లో అదృశ్యమైన మిరమ్ తరోన్ ఆచూకీ లభించింది. తమ భూభాగంలో ఒక భారతీయ బాలుడు దొరికాడని చైనా పీపుల్స్‌ లిబరేషన్‌ ఆర్మీ ఆదివారం ప్రకటించింది. నిబంధనల ప్రకారం త్వరలో అతన్ని భారతీయ ఆర్మీకి అప్పగిస్తామని తెలిపింది. సదరు దొరికిన బాలుడి వివరాలను చైనా ఆర్మీ వెల్లడించలేదు. జనవరి 18న తరోన్‌ చైనా భూభాగంలో అదృశ్యమైన సంగతి తెలిసిందే. దీంతో తరోన్‌ ఆచూకీ తెలుసుకోవడంలో సాయపడాలని ఇండియన్‌ ఆర్మీ పీఎల్‌ఏను కోరింది. ఈ నేపథ్యంలో తమకు బాలుడు దొరికాడని, ప్రొటోకాల్స్‌ పూర్తయ్యాక భారత్‌కు అప్పగిస్తామని చైనా ఆర్మీ ప్రకటించింది.

      

About Author