PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

చైనా బందీగా.. పాశవిక దాడి ఎదుర్కొన్న తరోణ్​ !

1 min read

పల్లెవెలుగువెబ్ : అరుణాచల్ ప్రదేశ్ కు చెందిన మిరామ్ తరోణ్​ తప్పిపోయి.. చైనా బందీగా మారిన సంగతి తెలిసిందే. ఇటీవల చైనా అతడిని భారత్ కు అప్పగించింది. ఈ మొత్తం ఘటనతో తన కుమారుడు భయపడిపోయాడని, మానసికంగా తీవ్రంగా కలత చెందాడని తరోణ్ తండ్రి ఒపాంగ్ తరోణ్ పేర్కొన్నారు. తమ కస్టడీలో ఉన్నప్పుడు చైనా ఆర్మీ తన కుమారుడిని బంధించిందని, కళ్లకు గంతలు కట్టిందని ఆరోపించారు. మిరామ్ ఇంకా ఆ షాక్ నుంచి తేరుకోలేదని, వెనక నుంచి అతడిని కాళ్లతో తన్నారని, స్వలంగా ఎలక్ట్రిక్ షాక్ కూడా ఇచ్చారని ఆరోపించారు. వారి బందీగా ఉన్నప్పుడు చాలా వరకు కళ్లకు గంతలు కట్టారని, అలాగే, చేతులు కూడా కట్టి ఉంచారని ఆరోపించారు. కేవలం భోజన సమయంలో మాత్రం వారితో కలుపుకునే వారని పేర్కొన్నారు. అయితే, తిండి మాత్రం తగినంత పెట్టారని ఒపాంగ్ విలేకరులకు తెలిపారు.

   

About Author