PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మణిపూర్ లో జరుగుతున్న హింసపై క్రైస్తవుల నిరసన గళం

1 min read

పల్లెవెలుగు వెబ్ గడివేముల:  మణిపూర్ లో క్రైస్తవులపై జరుగుతున్న దాడులపై నిరసన వ్యక్తం చేస్తూ గడివేముల మండల కేంద్రంలో గురువారం నాడు నంద్యాల జిల్లా క్రైస్తవ సంఘం ఆధ్వర్యంలో క్రైస్తవ సోదరులు నిరసన ర్యాలీ నిర్వహించారు భారతదేశ సంప్రదాయ సంస్కృతిని నాశనం చేస్తూ కొంతమంది ముష్కరులు కొన్ని రోజుల క్రితం మణిపూర్లో ఇద్దరు క్రైస్తవ మహిళలను వీధులలో నగ్నంగా ఊరేగిస్తూ వారిని అత్యాచారం చేసి చంపివేయడం ప్రభుత్వాలు ముష్కరులపై చర్యలు తీసుకోకపోవడంపై క్రైస్తవులపై మణిపూర్ లో జరుగుతున్న ఆకృత్యాలను వెంటనే ఆపాలని ఆ దిశగా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని బాధిత వర్గానికి రక్షణ కల్పించాలని నినదిస్తూ ర్యాలీగా వెళ్లి తాసిల్దార్ శ్రీనివాసులకు వినతి పత్రం అందజేశారు పాస్టర్ బి ఏం ప్రభు క్రైస్తవ సోదరులు పాల్గొన్నారు.

About Author