PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

గూడురులో..ఘనంగా క్రిస్మస్​ వేడుకలు

1 min read

పాస్టర్లకు, మత పెద్దలకు దుస్తులు పంపిణీ చేసిన టీడీపీ ఎస్సీ సెల్​ ఆర్గనైజింగ్​ సెక్రటరి నేసెపోగు కిరణ్మయి

పల్లెవెలుగు: కోడుమూరు నియోజకవర్గం గూడురు పట్టణంలో క్రిస్మస్​ పండుగ సంబరాలు అంబరాన్నంటాయి. పట్టణంలోని ఏబీఎన్​ చర్చిలో క్రిస్మస్​ సోదర సోదరీమణులు క్యాండిల్​ లైట్​ వెలిగించి… పండుగ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన టీడీపీ ఎస్సీ సెల్​ ఆర్గనైజింగ్​ సెక్రటరి నేసెపోగు కిరణ్మయి, భర్త జయకృష్ణ తో కలిసి పాస్టర్లు, మత పెద్దలు, ప్రజలకు నూతన వస్ర్తాలు పంపిణీ చేశారు. అలాగే బైబిల్​ క్విజ్​ పోటీల విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా కిరణ్మయి మాట్లాడుతూ యేసుక్రీస్తు లోకరక్షకుడని, ప్రభు మార్గంలో అందరూ నడవాలన్నారు. అనంతరం గూడురు, సి.బెళగల్​లోని పాస్టర్లు, మత పెద్దలు, సంఘం పెద్దలు ప్రజలకు క్రిస్మస్​ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో కిరణ్మయి కుటుంబ సభ్యులు నేషపోగు పూర్ణ చంద్ర రావు, విరుపాక్షి, గౌరి, ఎన్​.తులసీ, రెవ. ఎం. రవికుమార్​ , పాస్టర్​ ఎం.వి. సలోమి సిస్టర్​, యూత్​ ప్రెసిడెంట్​ బండి రాజు, తదితరులు పాల్గొన్నారు.

About Author