PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఏపిజేఎఫ్ అధ్వర్యంలో మృతుడి కుటుంబానికి క్రిస్మస్ కానుక..

1 min read

పల్లెవెలుగు వెబ్ ఎమ్మిగనూరు : గత కొద్దిరోజుల క్రితం మాధవరం రోడ్డు ప్రమాదంలో జర్నలిస్టు సామేల్ తన కూతురు ఇద్దరు మృతి చెందిన విషయం అందరికీ తెలిసిందే. అయితే భర్త, కూతురు మరణించడంతో కుటుంబ పెద్ద దిక్కు కోల్పోయింది. ఈ విషయం తెలుసుకున్న ఏపిజేఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు, శాశ్వత అధ్యక్షులు కె.ఎం.డి ఫారుక్, తాలుకా వర్కింగ్ ప్రెసిడెంట్ నాగరాజు ఆధ్వర్యంలో మృతి చెందిన కుటుంబానికి క్రిస్మస్ కానుకను అందచేశారు. ప్రతి క్రిస్మస్ పండుగకు ఏపిజేఎఫ్ యూనియన్ జర్నలిస్టు నాయకులు క్రిస్మస్ కానుక అందచేయడం జరుగుతుందని హామీ ఇచ్చారు. అదేవిధంగా ఆర్థిక సహాయం కూడ అందచేయడం జరిగింది.

About Author