NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

సీఐడీ సోదాలు.. క‌ళ్లుతిరిగి ప‌డిపోయిన ల‌క్ష్మినారాయ‌ణ

1 min read

పల్లెవెలుగు వెబ్​: ఏపీ సీఐడీ అధికారులు ప‌లువురు మాజీ ఐఏఎస్ అధికారుల ఇళ్లల్లో సోదాలు నిర్వహించారు. హైద‌రాబాద్ లోని మాజీ ఐఎఎస్ అధికారి ల‌క్ష్మినారాయ‌ణ ఇంట్లో హైడ్రామా న‌డుమ సీఐడీ అధికారులు సోదాలు నిర్వహించారు. విచార‌ణ సంద‌ర్భంగా ఉద్వేగానికి గురైన ల‌క్ష్మినారాయ‌ణ క‌ళ్లు తిరిగిప‌డిపోయారు. వెంటనే ఆయ‌న‌ను న‌గ‌రంలోని స్టార్ ఆస్పత్రికి త‌ర‌లించారు. ఆంధ్రప్రదేశ్ నైపుణ్యాభివృద్ధి సంస్థ చేప‌ట్టిన సీమెన్స్ ప్రాజెక్టుకు సంబంధించి 241 కోట్ల రూపాయ‌ల నిధులు దుర్వినియోగం అయ్యాయ‌న్న ఆరోప‌ణ‌ల‌తో మాజీ ఐఎఎస్ ల‌క్ష్మినారాయ‌ణ‌తో పాటు మ‌రికొంద‌రి పై సీఐడీ అధికారులు కేసు న‌మోదు చేశారు. ఐఎఎస్ ల‌క్ష్మినారాయ‌ణ‌తో పాటు చంద్రబాబు హ‌యాంలో నైపుణ్యాభివృద్ధి సంస్థ ఎండీగా ప‌నిచేసిన గంటా సుబ్బారావు ఇంట్లో కూడ సీఐడీ అధికారులు సోదాలు నిర్వహించారు.

About Author