NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

విజేతలకు బహుమతులు అందజేసిన నగర మేయర్

1 min read

పల్లెవెలుగు వెబ్ ఏలూరు : పండుగలు సందర్భంగా జీ వి మాల్ యాజమాన్యం కొనుగోలు దారులను ప్రోత్సహించడం కోసం ఏర్పాటు చేసిన బహుమతులను మంగళవారం నగరపాలక సంస్థ మేయర్ షేక్ నూర్జహాన్ పెదబాబు లాటరీ తీసి విజేతలకు బహుమతులను అందజేశారు. అతి తక్కువ సమయంలో ఖాతాదారుల ఆదరణ పొందిన ఏలూరులోనీ జీ.వి. మాల్ వస్త్ర షోరూం యాజమాన్యం క్రిస్టమస్, నూతన సంవత్సరం,సంక్రాంతి పండుగలను పురస్కరించుకుని ఖాతాదారులను ప్రోత్సహించడం కోసం 2 మారుతి ఆల్టో కార్లు, 3 టీవీఎస్ జూపిటర్ బైక్లను లాటరీ ద్వారా విజేతలకు అందచేయాలని నిర్ణయించారు. వెయ్యి రూపాయ కొనుగోలు చేసిన ఖాతాదారులకు ప్రత్యేక కుపను ఇచ్చారు. కూపన్లను నగరపాలక సంస్థ మేయర్ శ్రీమతి షేక్ నూర్జహాన్ పెదబాబు గారు చేతుల మీదుగా మంగళవారం రాత్రి ఖాతాదారుల సమక్షంలో జీ.వి. మాల్ షోరూమ్ వద్ద లాటరీ తీసి విజేతలకు స్వయంగా ఫోన్ చేసి కారు, మోటర్ సైకిల్ గెలుపొందారని తెలియజేశారు జీ మాల్ యాజమాన్యం రాము, సుమంత్, సిబ్బంది, ఖాతాదారులు తదితరులు పాల్గొన్నారు.

About Author