PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

పుల‌స ధ‌ర రూ. 23 వేలు !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : గోదావరిలో మత్స్యకారుల వలకు 2 కిలోల బరువున్న పులస చేప చిక్కింది. ఆదివారం యానాంలోని ఇందిరాగాంధీ చేపల మార్కెట్‌లో దాన్ని విక్రయించారు. పొన్నమండ భద్రం, రత్నం దంపతులు ఆ పులసను రూ.22వేలకు పాడుకున్నారు. తిరిగి వారు రూ.23వేలకు దాన్ని టి.కొత్తపల్లికి చెందిన వెంకటేశ్వరరావుకు విక్రయించారు. ఈ సంవత్సరం స్థానికంగా పులస చేపకు లభించిన అత్యధిక ధర ఇదే.

                                               

About Author