PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

సీవిల్​ సర్వీసెస్ ఫలితాలు వచ్చాయ్​! తెలుగువారిచే పైచేయి

1 min read

పల్లెవెలుగువెబ్​, ఢీల్లీ: 2020–సీవిల్​ సర్వీసెస్​ ఫలితాలను యూనియన్​ పబ్లిక్ సర్వీస్​ కమిషన్​ శుక్రవారం విడుదల చేసింది. ఈ ఫలితాల్లో తెలుగు వారే పైచేయిగా నిలవడం విశేషం. భారతదేశంలో సర్వోన్నత విద్య విధానంలోని ఐఏఎస్​, ఐపీఎస్​, ఐఎఫ్​ఎస్​ పోస్టులను సివిల్​ సర్వీసెస్​ ద్వారా భర్తీ చేస్తారు. ఈ క్రమంలో సదరు పోస్టులకు సంబంధించి 2020–సీవిల్స్​కు మొత్తం 761మంది అభ్యర్థులు ఎంపికయ్యారు. వీరిలో మహిళలు 216మంది, పురుషులు 545మంది ఉన్నారు. కాగా జనరల్​ అభ్యర్థులు 263మంది, ఓబీసీ 229 మంది, షెడ్యూల్డ్​ క్యాస్ట్​ 122మంది, ఈడబ్ల్యూఎస్​ కేటగిరి నుంచి 86మంది ఉన్నారు. ఇందులో వందలోపు ర్యాంక్​లు సాధించిన తెలుగువారిలో పి.శ్రీజ 20వ ర్యాంక్​, మైత్రీనాయుడు 27, రవికుమార్​ 84, యశ్వంత్​రెడ్డి 93వ ర్యాంక్​ సాధించారు. కాగా మొదటి ర్యాంక్​ శుభంకుమార్​, 2వ ర్యాంక్​ జాగృతి, మూడవ ర్యాంక్​ అంకితాజైన్​లు ఉన్నారు.

About Author