PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఏపీలో అంత‌ర్యుద్ధం !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ఏపీలో ప్రజలను పోలీసులు హింసిస్తున్నారని, ఇది ఇలాగే కొనసాగితే పరిస్థితులు అంతర్యుద్థానికి దారి తీయవచ్చని వైసీపీ రెబల్‌ ఎంపీ రఘురామకృష్ణరాజు ఆందోళన వ్యక్తం చేశారు. నిబంధనలను తోసిపుచ్చి.. డీజీపీ నియామకం చేపట్టారని, దీనిని నిరసిస్తూ తాను గతంలో రెండుసార్లు యూపీఎస్సీకి లేఖ రాశానని తెలిపారు. ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలోని శాంతి భద్రతల పరిస్థితులపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు లేఖ రాసినట్టు తెలిపారు. ఈ అంశంపై నేరుగా జోక్యం చేసుకోవాలని రాష్ట్రపతిని కోరానన్నారు. సుప్రీంకోర్టు గత తీర్పుల ప్రకారం డీజీపీకి రెండేళ్ల పదవీకాలం ఉండాలని, సీఎం తన ఇష్టానుసారంగా తీసేయలేరని అన్నారు. రాష్ట్ర డీజీపీ నియామకానికి ఓ విధానం ఉందని రఘురామ తెలిపారు. ‘‘మా ఊరి వాడు, కడప రెడ్డి అని డీజీపీ పదవిని కట్టబెడతామంటే కుదరదు’’ అన్నారు.

                                                 

About Author