PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

గాజులపల్లె 2 పంచాయతీ కార్యాలయంలో ఘర్షణ

1 min read

పల్లెవెలుగు వెబ్ మహానంది:  మహానంది మండలంలోని గాజులపల్లె 2 పంచాయతీ కార్యాలయంలో ఘర్షణ జరిగినట్టు సమాచారం. గత వారం పది రోజుల నుంచి ఒక వ్యక్తి తమ కుమారుని ఈ యొక్క ఆధార్ కార్డులో మార్పులకు చేర్పులకు సంబంధించి తిరుగుతున్న పరిష్కారం కాకపోవడంతో మంగళవారం సంబంధిత ఉద్యోగిని దీనిపై ప్రశ్నించగా వివాదం మొదలై ఘర్షణకు దారి తీసినట్లు సమాచారం. ఈ విషయం మహానంది పోలీస్ స్టేషన్ కు చెందినట్లు తెలుస్తుంది. ఈ ఘర్షణలో ఒకరికి స్వల్ప గాయాలు అయినట్టు తెలుస్తుంది. మద్యం మత్తులో వివాదం చోటు చేసుకున్నట్లు కొందరు ఆరోపిస్తున్నారు. దీనికి సంబంధించి ఆయా పంచాయతీ కార్యాలయాల సిబ్బంది పోలీస్ స్టేషన్కు చేరుకున్నట్లు సమాచారం.

About Author