PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఆదోనిలో వ‌ర్గ విబేధాలు.. ప‌రస్ప‌రం క‌ట్టెల‌తో దాడి !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : క‌ర్నూలు జిల్లాలోని ఆదోని మండలం సంతెకుడ్లూరులో వ‌ర్గ విభేదాలు ప‌ర‌స్ప‌ర దాడికి ప్రేరేపించాయి. హోలీ ఊరేగింపు విషయంలో రెండు వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఒకరిపై ఒకరు పరస్పరం కర్రలతో దాడి చేసుకున్నారు. ఈ ఘటనలో పలువురికి గాయాలయ్యాయి. వారిని స్థానికంగా ఆస్పత్రికి తరలించిన స్థానికులు వైద్యం అందిస్తున్నారు. విషయం తెలుసుకుని ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

                                      

About Author