PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

కేబినెట్ భేటీలో మంత్రుల‌కు క్లాస్ !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : కేబినెట్ భేటీ తర్వాత మంత్రులతో సీఎం జగన్‌ విడిగా సమావేశమయ్యారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ విషయంపై కేబినెట్‌లో సీఎం ప్రస్తావించినట్లు సమాచారం. దుష్టచతుష్టయంపై ఎందుకు గట్టిగా స్పందించట్లేదని మంత్రులకు జగన్‌ క్లాస్ తీసుకున్నట్లు చెబుతున్నారు. ‘ప్రతిమీటింగ్‌లో నేనే వారిని టార్గెట్ చేయాలా?.. మీరేం చేస్తున్నారంటూ’ మంత్రులపై జగన్‌ మండిపడ్డారు. దుష్టచతుష్టయానికి మంత్రులు బయపడుతున్నారా అని ప్రశ్నించారు. ప్రతిపక్షాల విమర్శలకు ధీటుగా సమాధానం చెప్పాలని మంత్రులను ఆదేశించారు. ఎప్పటికప్పుడు కౌంటర్లు ఇవ్వాలని, లేదంటే మరోసారి మంత్రులను మార్చాల్సి వస్తుందని జగన్ హెచ్చరించారు.

                                                  

About Author