PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ముస్లింల రాజకీయ అభ్యున్నతికి సీఎం దృష్టి సారిస్తున్నారు..

1 min read

ముస్లిం పురోగతి కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాల్గొన్న నియోజకవర్గ ఇన్చార్జి బుట్టా రేణుక

పల్లెవెలుగు వెబ్ ఎమ్మిగనూరు :  ఎమ్మిగనూరులో ముస్లింల పురోగతి కార్యక్రమాన్ని మున్సిపల్ ఓపెన్ థియేటర్ నందు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి బిఆర్. సిరాజ్ ఉర్ రహిమాన్ , ఎమ్మిగనూరు సమన్వయకర్త శ్రీమతి బుట్టా రేణుక  ముఖ్య అతిధిగా హాజరైయ్యరు. ముస్లింలు తమ బిడ్డలపై విద్యపై దృష్టి సాధించేలా కృషి చేయాలని బ్రదర్ సిరాజ్ ఉర్ ప్రేమను పేర్కొన్నారు. అప్పుడే అన్ని రంగాల్లో రాణిస్తారని తెలిపారు. అనంతరం ఎమ్మిగనూరు సమన్వయకర్త శ్రీమతి బుట్టా రేణుక  మాట్లాడుతూ ముస్లింలకు నాలుగు శాతం రిజర్వేషన్ కల్పించి వారి అభ్యున్నతికి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి కృషి చేశారని, అదేవిధంగా వచ్చే ఎన్నికల్లో రాజకీయంగా ముస్లింలకు అధికంగా సీట్లు కేటాయించేలా జగన్మోహన్ రెడ్డి దృష్టి సారిస్తున్నారని తెలిపారు.ఈ కార్యక్రమంలో  బుట్టా శివనీలకంఠ, బుట్టా ప్రతూల్ , ముస్లిం సోదరీమణులు, పట్టణ అధ్యక్షులు, మున్సిపల్ వైస్ చైర్మన్, మైనార్టీ నాయకులు, కౌన్సిలర్లు, ఇన్ చార్జ్ లు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

About Author