NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

వైద్యారోగ్యశాఖలో 14,200 పోస్టుల భర్తీకి సీఎం జగన్‌ ఆమోదం

1 min read

అమరావతి: ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో నియామకాల భర్తీకి సీఎం జగన్‌ ఆమోదం తెలిపారు. వైద్యారోగ్యశాఖపై ఏపీ సీఎం జగన్‌ సమీక్ష నిర్వహించారు. ప్రస్తుత సిబ్బంది, కావాల్సిన సిబ్బందిపై వివరాలను సీఎం అడిగి తెలుసుకున్నారు. ప్రాథమిక ఆసుపత్రుల నుంచి భోధనాసుపత్రుల వరకు సుమారు 14,200 పోస్టులు భర్తీ చేయాలని నిర్ణయించారు. అక్టోబరు నుంచి ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ప్రారభించి, నవంబర్‌ 15 నాటికి ఉద్యోగాల భర్తీ ముగించాలని సూచించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ వైద్యులు, సిబ్బంది కొరత ఉండవద్దని సీఎం ఆదేశించారు.

About Author