PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఇంద్రకిలాద్రి దుర్గమ్మకు సీఎం జగన్​ పట్టువస్త్రాలు సమర్పణ

1 min read

పల్లెవెలుగువెబ్​, విజయవాడ: ఇంద్రకిలాద్రిపై జరుగుతోన్న దేవీశరన్నవరాత్రోత్సవాలను పురస్కరించుకుని అమ్మవారి జన్మనక్ష్రతం(మూల నక్షత్రం) రోజున ఏపీ సీఎం వైఎస్​.జగన్​ మంగళవారం దుర్గమ్మ ప్రభుత్వ పట్టువస్త్రాలను లాంఛనంగా సమర్పించారు. ముందుగా పట్టువస్త్రాలకు ఇచ్చేందుకు సీఎం జగన్​కు రాష్ట్ర మంత్రులు వెల్లంపల్లి శ్రీనివాస్​, కొడాలి నాని, దేవస్థానం అధికారులు, అర్చకస్వాములు, పండితులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. తదుపరి అర్చకులు సీఎం. జగన్​కు తలపాగా చుట్టగా ప్రభుత్వ లాంఛనాలతో దుర్గామల్లేశ్వరస్వామివార్లకు పట్టువస్త్రాలు సమర్పించారు. పట్టువస్త్రాలు సమర్పించాక దేవస్థానం అధికారులు సీఎంజగన్​ను ఆలయ సంప్రదాయాన్ని అనుసరించి శేషవస్త్రాలు, ప్రసాదాలు, జ్ఞపికలతో ఘనంగా సత్కరించారు.

About Author