NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

భారీగా సీఎం జగనన్న  సిద్ధం  సభకు తరలి వెళ్లిన నాయకులు

1 min read

పల్లెవెలుగు వెబ్ ఆలూరు: సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా “మేమంతా సిద్ధం సభకు” ఎమ్మిగనూరు నియోజకవర్గానికి సీఎం శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి విచ్చేస్తున్న సంధర్భంగా శుక్రవారం రాబోయే సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో బస్సు యాత్రలో భాగంగా మనందరి అభిమాన నాయకుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి  ఎమ్మిగనూరు నియోజకవర్గానికి విచ్చేయుచున్నారు .

 మేమంతా సిద్ధం సభ కార్యక్రమంలో భాగంగా

 ఆలూరు నియోజకవర్గ ఇంచార్జ్ శ్రీ బుసినే విరుపాక్షి  ఆధ్వర్యంలో అలూరు నియోజకవర్గంలోని ఆరు మండలాల కన్వీనర్లు,ఆరు మండలాల కో- కన్వీనర్లు, ఆరు మండలాల జెడ్పీటీసీ సభ్యులు,ఎంపీపీలు,వైస్ ఎంపీపీలు, ఆరుమండలాల కో ఆప్షన్ సభ్యులు, కేడీసీసీ డైరెక్టర్లు, సొసైటీ చైర్మన్లు, ఆరు మండలాల JCS కన్వీనర్లు, నీటి సంఘం అధ్యక్షులు, రైతు సంఘం అధ్యక్షులు, అన్ని గ్రామాల సర్పంచులు, అన్ని గ్రామాల ఎంపీటీసీలు, అన్ని గ్రామాల వార్డు మెంబర్లు, అన్ని గ్రామాల సచివాల కన్వీనర్లు, విద్యా కమిటీ చైర్మన్లు, గృహ సారధులు, బూత్ కమిటీ సభ్యులు, వివిధ హోదాల్లో ఉన్న ప్రతి వైఎస్సార్సీపీ కుటుంబ సభ్యులు,నాయకులు, కార్యకర్తలు,ప్రజలు, ప్రతి ఒక్కరూ” మేమంతా సిద్ధం” సభను విజయవంతం చేయాలని భారీగా తరలి వెళ్ళడం జరిగింది.

About Author