NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

డిస్టింక్ష‌న్ లో పాస్ అయిన‌ సీఎం జ‌గ‌న్ కుమార్తె !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రస్తుతం పారిస్‌ పర్యటనలో ఉన్నారు. అక్కడ తమ కుమార్తె హర్ష గ్రాడ్యుయేషన్‌ కాన్వొకేషన్‌ వేడుకలో శనివారం సీఎం జగన్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కుమార్తెపై తన ప్రేమను సీఎం జగన్‌ ట్విటర్‌ ద్వారా పంచుకున్నారు. ‘డియర్‌ హర్ష, నీ అద్భుతమైన ఎదుగుదలను చూసి మాకు ఎంతో గర్వంగా ఉంది. నీకు దేవుడి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయి. ఇన్‌సీడ్‌ బిజినెస్‌ స్కూల్‌ నుంచి డిస్టెంక్షన్‌లో పాస్‌ అయినందుకు నేను గర్వపడుతున్నాను. డిస్టింక్ష‌న్‌తో పాటు డీన్స్ జాబితాలోనూ చోటు సంపాదించ‌డం సంతోషంగా ఉంది. భవిష్యత్‌లో భగవంతుడు నీకు అన్ని విధాలుగా తోడుగా నిలవాలని కోరుకుంటున్నాను’ అంటూ సీఎం జగన్‌ ట్వీట్‌ చేశారు.

                                               

About Author