PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

అభివృద్ధి ,సంక్షేమం రెండు కళ్లుగా సీఎం జగన్ పాలన..

1 min read

– ఇంటింటికీ సంక్షేమ లబ్దిని అందించిన సీఎం జగన్..

– సుపరిపాలనను అందిస్తున్న జగన్ ను మళ్లీ సీఎం చేయాలి.

– నందికొట్కూరు మండలం కొనేటమ్మపల్లి లో నిర్వహించిన వై ఏపీ నీడ్స్ సీఎం జగన్ కార్యక్రమంలో  వైసీపీ మండల అధ్యక్షుడు రవియాదవ్.

పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: అభివృద్ధి ,సంక్షేమం రెండు కళ్లుగా సీఎం జగన్ పాలన కొనసాగుతోందని నందికొట్కూరు మండలం వైసీపీ పార్టీ అధ్యక్షుడు రవియాదవ్ అన్నారు. సోమవారం  మండలంలోని కొనేటమ్మపల్లిలో  ఎంపీపీ మురళీ కృష్ణా రెడ్డి ఆధ్వర్యంలో  నిర్వహించిన వై ఏపీ నీడ్స్ సీఎం జగన్ కార్యక్రమంలో రవియాదవ్ పాల్గొన్నారు. నాలుగున్నరేళ్లుగా సంక్షేమ, అభివృద్ధి పథకాల ద్వారా రాష్ట్రాన్ని సీఎం వైఎస్‌ జగన్‌ ప్రగతిపథంలో నిలపడాన్ని   ప్రజలకు వివరించారు. కొనేటమ్మపల్లి  గ్రామానికి చేసిన మంచిని గణాంకాలతో సహా కళ్లకు కట్టినట్లు  వెల్లడించి సంక్షేమ పథకాల బోర్డును స్థానిక నాయకులతో కలసి  ఆవిష్కరించారు.జెండాను ఆవిష్కరించారు.ఈ సందర్భంగా రవియాదవ్ మాట్లాడుతూ  రాష్ట్ర ప్రజల ఉజ్వల భవిష్యత్ కు బంగారు బాట వేస్తున్న  ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి  నాయకత్వం ఏపీకి అవసరం అన్నారు. సీఎం జగనన్న అందిస్తున్న సుపరిపాలనతో రాష్ట్రాభివృద్ధి, ప్రజా సంక్షేమం సాధ్యపడుతుందన్నారు. పాదయాత్రలో ప్రజల కష్టాలు తెలుసుకున్న సీఎం జగనన్న, వారందరి జీవన ప్రమాణాలు పెంపొందించడానికి సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని వెల్లడించారు. ఎన్నికల మేనిఫెస్టోలో 99.5 శాతం హామీలను సీఎం వైఎస్‌ జగన్‌ అమలు చేసి మాట నిలబెట్టుకోగా 2014లో చంద్రబాబు వ్యవసాయ, డ్వాక్రా రుణాలను మాఫీ చేయకుండా నిలువునా మోసగించిన తీరును వివరించారు.ప్రజలు ఎక్కడ నిలదీస్తారోనన్న భయంతో నాడు అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోనే చంద్రబాబు మేనిఫెస్టోను మాయం చేయడాన్ని గుర్తు చేశారు.  చంద్రబాబు పవన్‌లు ఉమ్మడి మేనిఫెస్టోతో వస్తున్నారని, వారికి తగినరీతిలో బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. సుపరిపాలన కొనసాగాలంటే సీఎం జగన్‌ను ఆశీర్వదించి మరోసారి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. రైతుల పక్షపాతిగా  అనునిత్యం అభివృద్ధిలో ముందుకు వెళ్తూ రైతుల కు అండగా నిలుస్తున్నాడని అన్నారు.కార్యక్రమంలో   జడ్పీటీసీ కలిమున్నీసా, నందికొట్కూరు మార్కెట్ యార్డ్ చైర్మన్ షేక్ రాహాత్ జబ్బార్ , జేసీఎస్ కన్వీనర్  ఓంకార్ రెడ్డి ,బ్రాహ్మణ కొట్కూరు సింగిల్ విండో చైర్మన్ మద్దూరు సతీష్ రెడ్డి ,డైరెక్టర్ గంగాధరప్ప,నందికొట్కూరు సింగిల్ విండో చైర్మన్ లక్ష్మి కాంతరెడ్డి  , బ్రాహ్మణకొట్కూరు వైసీపీ నాయకులు . వెంకట్ రెడ్డి, వైస్ ఎంపీపీ పబ్బతి జ్యోతి రవి కుమార్ ,కొనేటమ్మపల్లె  వైసీపీ నాయకులు,గోవింద్ రెడ్డి, గోపాల్ రెడ్డి, శశిధర్ రెడ్డి, కొల్లాబపురం  నాగార్జున యాదవ్, మార్కెట్ యార్డ్  సభ్యులు రాముడు,హరీష్ యాదవ్,సుబ్బన్న,జైచంద్ర,కురువ చిన్నోడు, కురువ రాజు, షరీఫ్, పెద్ద రాముడు, సొలొమోను, రంగస్వామి ,నందికొట్కూరు మండల ఎంపీటీసీలు,సర్పంచ్ లు ఉప సర్పంచ్ లు, వైస్సార్సీపీ నాయకులు,మండల కమిటీ సభ్యులు,గృహ సారథులు, వాలంటీర్స్,గ్రామ ప్రజలు, మండల స్థాయి అధికారులు ,వైసీపీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

About Author