NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

స్టాలిన్ తో సీఎం కేసీఆర్ భేటీ.. రాజకీయ ప్రాధాన్యం !

1 min read

పల్లెవెలుగు వెబ్​ :తమిళనాడు సీఎం స్టాలిన్ తో తెలంగాణ సీఎం కేసీఆర్ భేటీ అయ్యారు. తమిళనాడులోని శ్రీరంగం రంగనాథ స్వామి ఆలయాన్ని నిన్న దర్శించుకున్న సీఎం కేసీఆర్.. చెన్నైలోనే బస చేశారు. ఇవాళ సీఎం స్టాలిన్ తో చెన్నైలో భేటీ అయ్యారు. ఇరువురు ముఖ్యమంత్రుల భేటీ రాజకీయ ప్రాధాన్యం సంతరించుకుంది. జాతీయ, రాజకీయ పరమైన అంశాలు, పాలనాపరమైన అంశాలు ఈ భేటీలో చర్చించినట్టు సమాచారం. ప్రస్తుత పరిస్థితులను విశ్లేషించి భవిష్యత్ కార్యాచరణ పై సమాలోచనలు జరుపుతన్నట్టు సమాచారం.

About Author