PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

చిరంజీవికి సీఎం కేసీఆర్ ఫోన్ !

1 min read

పల్లెవెలుగువెబ్ : మెగాస్టార్ చిరంజీవికి తెలంగాణ సీఎం కేసీఆర్ ఫోన్ చేశారు. ఇటీవల చిరంజీవి కరోన బారినపడ్డారు. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ ఫోన్ చేసి చిరంజీవిని పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. కరోన నుంచి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. చిరంజీవి కుటుంబ సభ్యులతో కూడ కేసీఆర్ ఫోన్ లో మాట్లాడారు. తాను కరోనా బారిన పడినట్లు నిన్న చిరంజీవి ట్విట్టర్ వేదికగా ప్రకటించిన విషయం తెలిసిందే. సీఎం కేసీఆర్ తనకు ఫోన్ చేసి పరామర్శించడం పట్ల చిరంజీవి హర్షం వ్యక్తం చేశారు.

     

About Author