PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

సీఎం రిలీఫ్ ఫండ్ చెక్ అందజేత

1 min read

పల్లెవెలుగు వెబ్​, రాయచోటి : అనారోగ్యంతో బాధపడుతున్న వారికి వైద్య చికిత్సల నిమిత్తం సీఎం వైఎస్​ జగన్​మోహన్​ రెడ్డి సీఎంఆర్​ఎఫ్​ కింద నిధులు మంజూరు చేస్తున్నారని, ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ప్రభుత్వ చీఫ్​ విప్​ శ్రీకాంత్​ రెడ్డి తెలిపారు. మంగళవారం ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి మంజూరైన రూ.80వేల చెక్కును సంబేపల్లె మండలం మోటకట్ల గ్రామం మల్లూరువాండ్ల పల్లెకు చెందిన మదనపల్లె శివయ్య భార్య కృష్ణమ్మకు ప్రభుత్వ చీఫ్​ విప్​ అందజేశారు. అనారోగ్యంతో ఆర్థికంగా చితికిపోయిన తమ కుటుంబానికి సీఎం ఆర్​ఎఫ్​ కింద నిధులు మంజూరు చేయడం వల్ల కొంత ఊరట కలిగిందని, సీఎం వైఎస్​ జగన్​మోహన్​ రెడ్డికి రుణపడి ఉంటామని ఈ సందర్భంగా కృష్ణమ్మ తెలిపారు.

About Author